ఇంగ్లీషు మీడియం కోసం జగన్ అడుగులు

- (నిన్నటి సంచిక తరువాయి) ఇక్కడ ఇంగ్లీషు ప్రధానమైనట్లే అక్కడ వారికి నచ్చిన ఇంకో భాషలో చదవమని నిర్బంధం చేయవచ్చు. ఈ పరిణామాల కారణంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ దేశంలో ఇప్పటికి ఉన్నసమస్యలే కాకుండా భాషపరమైన సమస్యలు కూడా అధికమవు తాయి. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో ఇలాంటి ఉల్లంఘనలు దృష్టిలో ఉంచుకొనే నూతన జాతీయ విద్యావిధానం ముసాయిదాలో ఒకటి నుండి ఎనిమిది వరకు మాతృభాషలో విద్యావిధానం అమలుకు కేంద్రం చర్యలు తీసుకోబోతోంది. దేశవ్యాప్తంగా త్రిభాష సూత్రం అమలుచేసి ఒకే విధానం అమలు జరుగుతోంది. ప్రథమభాషగా మాతృభాష, ద్వితియభాషగా జాతీయభాష, తృతీయ భాషగా ఇంగ్లీషు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉంది. మాద్యమ భాగా మాతృభాష ఇన్నాళ్ళు సాగింది. గత రెండు దశాబ్దాల కాలంగా రాష్ట్రంలో వ్యాపారధోరణిలో ప్రవేశించిన ప్రయివేటు పాఠశాలలకు రాజ్యంగ విరుద్దంగా ఇంగ్లీషు మీడియంలో అనుమతులిచ్చారు. అది తీవ్ర స్థాయికి చేరింది. ఏకంగా ప్రభుత్వ పాఠశాలలనే ఇంగ్లీషు మీడియంలో కొనసాగే వరకు వచ్చింది. సమస్య ప్రారంబమైన చోట పరిష్కారం కోసం ప్రయత్నం చేయకుండా, ఆ సమస్యలో ఒక పక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కావడం అసమంజసంగా అనిపిస్తుంది. భారత రాజ్యాంగం ఆర్టికల్- 21 ప్రకారం రాజ్యం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు గల బాల బాలికలకు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని తెలుపుతుంది. రాజ్యాంగంలోని పదిహేడవ భాగం మొత్తం అధికార భాషా సంబంధిత అంశాలను వివరిస్తుంది. ఆర్టికల్ 343, 344 లలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన అనంతరం 15 సంవత్సరాలు ఇంగ్లీషు అధికారిక భాషగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే అధికారికభాష సంఘం నెలకొల్పి హిందీని అధికార భాషగా ఉపయోగించడానికి సిఫారసులు చేయడం, ఇంగ్లీషు భాషా వినియోగం భాషపరమైన న్న సమస్యలే తగ్గించాలని తెలుపుతుంది. ఆర్టికల్- 350 ప్రజలు తమ కేంద్ర రాష్ట్ర అధికారుల ముందు తమ సంతాపాలు, బాధలు భాషలోనైనా రాసి ఇవ్వవచ్చని ఉంది. 350- (ఎ) ప్రకారం బాలబాలికలలకు ప్రతిరాష్ట్రంలోను ప్రాథమిక విద్యను మాతృభాషలోనే అందదచేయడానికి అవరమైన చర్యలను చేపట్టాలి. 350- (బి) ప్రకారం రాష్ట్రపతి భాషా మైనారిటీ లపై అధ్యయనానికి ప్రత్యేక అధికారిని నియమిస్తారు. ఈ ప్రత్యేక అధికారి రాజ్యాంగ ప్రకారం మైనారిటీల భాష అభివృద్ధికి అందించవలసిన రక్షణలు సరిగా అందుతున్నాయో లేదో సరిచూస్తుంది. అల్పసంఖ్యాక వర్గాల భాష గురించి రాజ్యాంగం లోని ఆర్టికల్ 29(1) ప్రకారం భారతదేశంలో నివసిస్తున్న పౌరులు ఏ వర్గంలో వారైనా వారి విశిష్ట భాష, లిపి లేదా సంస్కృతి ఉన్నట్లయితే దానిని కాపాడుకొనే హక్కు వారికుంటుంది. ఆర్టికల్ 30(1), (2) ప్రకారం భాషపరమైన అల్పసంఖ్యాక వర్గీయులు తమకు నచ్చినవిధంగా విద్యాసంస్థలు నెలకొల్పుకొని నిర్వహించుకోవచ్చు. ఆ విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం విషయంలో రాజ్యం వివక్ష చూపరాదు అని తెలియచేస్తుంది. రాజ్యాంగంలోని పై మొత్తం అంశాలను బట్టి ప్రాథమిక విద్య అంటే ఎనిమిదోవ తరగతి వరకు మాతృభాషలో విద్య పొందే హక్కు కల్పిస్తుంది. అల్ప సంఖ్యాక భాషల హక్కులను సంరక్షణ కోసం రాష్ట్రపతి చర్యలు కూడా తీసుకోవచ్చని తెలియచేస్తుంది. జాతీయ భాషగా ఇంగ్లీషును తగ్గించి హిందీకి ప్రాధాన్యత ఇవ్వాలని వివరిస్తుంది. విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. ఎవరు చట్టం చేయాలన్నా రాజ్యాంగ మౌళిక లక్ష్యాలకనుగుణంగా ఉండాలి. ఇది భావోద్వేగాలకో, జనాభిప్రాయానికో పరిమితమైన అంశంకాదు. ఏ మార్పులు చేయాలన్నా రాజ్యాంగ సవరణ తప్పని సరి అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ రూల్స్, జి.ఓ యస్ నెం :1188 %--% 10మే 1996 ప్రకారం, సెక్షన్ 48 మీడియం ఇన్‌స్ట్రక్షన్ లో రమైన చర్యలను చేపలు మాతృభాషలో కొలబాలికలలకు ఈ కSREE దేశంలో నివసిసును లు ఏ వర్గంలో వారి మాతృభాషలో విద్యాబోధన చేయాలి. అల్ప సంఖ్యాక భాష వారు కనీసం పదిమంది ఉంటే సమాంతరంగా ఒక సెక్షన్ ఏర్పాటు చేయాలని తెలియచేస్తుంది. ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం( యాక్ట్ నెం 35/ 2009) సెక్షన్ 29(యఫ్) ప్రకారం విద్యార్థుల మాతృభాషలో బోధన ఉండాలని తెలియచేస్తుంది. మన్ కీ బాత్ లో.. మాతృభాష గురించి ప్రత్యేకంగా మాట్లాడిన నరేంద్రమోడీ.. కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే.. ఎంత అభివృద్ధి సాధించినా వృథానేని స్పష్టం చేశారు. ఓ వ్యక్తి సమగ్ర పురోగతికి అతడి భాషా పురోగతే మూలం అని.. ఆధునిక హిందీ భాష పితగా పేరొందిన భారతేందు హరిశ్చంద్ర 150 ఏళ్ల క్రితం చెప్పారని మోడీ గుర్తు చేశారు. మాతృభాషలో పరిజ్ఞానం లేకుండా పురోగతి సాధ్యం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్లోని ధారాచులా అనే గ్రామంలో ప్రజలు తమ భాషను కాపాడుకుంటున్నారంటూ ప్రధాని వారిపై ప్రశంసలు గుప్పించారు. మన నాగరికత, సంస్కృతి, భాషలు.. ప్రపంచానికి భిన్నత్వంలో ఏకత్వాన్ని బోధిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చాలా భాషలు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ విషయమై అవగామన కల్పించడం కోసం ఐక్యరాజ్య సమితి 2019ను అంతర్జాతీయ స్వదేశీ భాషల సంవత్సరంగా గుర్తించింది. ఏపీ సర్కార్.. తెలుగు మీడియంను రద్దు చేయాలని నిర్ణయించడం.. అదే సమయంలో.. మోడీ మాతృభాషపై కీలకమైన వ్యాఖ్యలు రచేయడం.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగు మీడియం ఉండాలన్న వారిని ఇంగ్లిష్ మీడియంకు వ్యతిరేకం అన్నట్లుగా ప్రచారం చేస్తూ.. రాజకీయంగా ఏపీ సర్కార్ ఎదురు దాడి చేస్తోంది కానీ.. అసలు సమస్యను గుర్తించడం లేదు. రాజకీయంగా.. తాను అనుకున్నది సాధించడానికి జగన్ తాపత్రయ పడుతున్నారు కానీ.. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేయడం లేదు. మోడీ.. మన్ కీ బాత్ తర్వాతైనా.. జగన్ మనసు మార్చుకుంటారో.. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లని వాదిస్తారో.. వేచి చూడాల్సిందే..! - వాడీ కామెంట్స్ పై చర్చ మాతృభాష ! సాధ్యం కాదని ప్రధాని - -


పులవర్తి ప్రభు,


ఫ్రీలాన్స్ జర్నలిస్టు,విజయవాడ