వెలుతురు వేడితో పాటుగా సూర్యుని నుండి జీవులకు హాని కలిగించే మంది జీవలకు హాని కలిగించే అలా వయొలెట్ కిరణాలు (యు.వి) భూమి మీద పడకుండా భూమి చుట్టూ ఉన్న ఓజోన్ పొర కాపాడుతుంది. 1839లో జర్మన్ శాస్త్రవేత్త క్రిస్టియన్ స్కోన్ బియాస్ ఓజోన్ వాయువు ను కనుగొన్నాడు. మానవుల కార్యకలాపాల వలన వాతావరణం కలుషితమై ఓజోన్ పొర దెబ్బ తింటున్నది . 19వ శతాబ్దంలో మొదలయిన ఇండస్ట్రీలైజేషన్ ప్రకృతి ని దెబ్బతీసింది. 40 ఏళ్లలో ఇది మరింత ప్రమాదకరంగా మారింది. ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం కు తోడు మనిషి తన సుఖవంతమైన జీవితానికి తయారు చేసుకున్న చాలా వస్తువులు ప్రకృతికి వ్యతిరేకంగా తయారయిన తయారయ్యాయి దీనికి తోడు అడవుల విస్తీర్ణం తగ్గుతుంది ఫలితంగా ప్రకృతి గతి తప్పుతోంది రేడియేషన్, పొల్యూషన్, ఈ వేస్టేజ్, గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్, ప్లాస్టిక్, వాడకం ఇలా చాలా రకాలుగా భూమిని మానవులు కలుషితం చేస్తూనే ఉన్నారు. 1985లో శాస్త్రవేత్తలు ఓజోన్ పొరకు చిల్లు పడిందని గుర్తించారు. ఫలితంగా ఓజోన్ పొరను రక్షించే ఆవశ్యకత మొదలైంది. ప్రకృతిలో జరుగుతున్న మార్పులు జీవజాతి నాశనానికి దారులు ఏర్పడుతున్నాయి. ఓజోన్ పొర పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16 న జరుపుకుంటారు. ఓజోన్ పొరను తగించే పదార్థాలపై మాంట్రియల ప్రొటోకాల 1981 లో సంతకం చేసిన పదార్థాలపై మాంట్రియల్ ప్రోటోకాల్ 1987 లో సంతకం చేసిన జ్ఞాపకార్థం, వాతావరణ మార్పు ఓజోన్ క్షీణతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించే కార్యకలాపాలను ఈ రోజు చేపడుతారు . భూమిపైన వ్యాపించి వున్న గాలి పొరను వాతావరణం అంటారు. ఇది సుమారు 1000 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది. దీనిని ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం , ఉష్ణ ఆవరణం, ఎకో ఆవరణం, అనే ఐదు పొరలుగా వర్గీకరించారు రెండవది అయిన స్ట్రాటో ఆవరణంలోని 17 నుంచి 48 కిలోమీటర్ల ఎత్తులో సహజంగా తయారయిన ఓజోన్ పొర ఉంటుంది. ఇది లేత నీలి రంగులో ఉంటుంది సూర్యుని నుండి వెలువడే ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలను భూమి పైన పడకుండా ఆపి జీవులను వేడి నుంచి కాపాడుతుంది. . ఓజోన్ పొర జీవావరణానికి రక్షక కవచం లాగా పని చేస్తుంది . కానీ జీవావరణం లో చేరితే విషమవుతుంది .ఓజోన్ పొర సూర్యుని నుండి వెలువడే ప్రమాదకరమైన (యు వి) రేడియో కిరణాలను ఆపి వేడి నుండి భూమిని కాపాడుతుంది ఓజోన్ పొర ను పలుచన చేసేవి అతి ముఖ్యమైన కారకాలు క్లోరోఫ్లోరో కార్బన్లు. ఓజోన్ పొర క్షీణించడం వలన సూర్యుని నుం నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూమిని చేరుతాయి. వీటి వలన మొక్కలు తెలికగా తెగుళ్ళ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . మానవ ఉన్నాయి . మానవులలో రోగ నిరోదకత శక్తి తగ్గుతుంది. చర్మ సంబంధిత వ్యాదులు, చర్మ క్యాన్సర్లు వస్తాయి. అలాగే దృష్టి లోపాలు ఏర్పడి కంటి జబ్బులు వస్తాయి. వేడికి సముద్రపు జీవులు నశించి పోతాయి. మంచు కరిగి పోయి నీటి కరువులు ఏర్పడుతాయి. ఇలా అనేక రుగ్మతలు జీవులపై ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణం మానవుడు ఉపయోగించే అనాలోచిత కార్యక్రమాల వలన ఓజోన్ పొర పలుచన అవుతుంది. ముఖ్యంగా వాహనాలు, పరిశ్రమలు, సూపర్ సోనిక్ జెట్ విమానాల, నుండి నైట్రోజన్ ఆక్సైడ్, విడుదల అవుతాయి. ఈ వాయువులు స్ట్రాటో ఆవరణం చేరి ఓజోన్ అణువును క్షీణింప చేస్తాయి. అలాగే రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఫోమ్ బ్లోయింగ్ లోను , ఎయిరో సోల్స్ లోను క్లోరో ఫ్లోరో కార్బన్లను (సి.ఎఫ.సి) వాడుతారు. వీటిని ప్రియాన్స్ అంటాము. మంటలను ఆర్పే యంత్రాలలో ను వాడుతారు సి.ఎఫ్.సి లు హలోన్లు ఉపయోగించినప్పుడు వాటి నుండి వెలువడే వాయువులు ఓజోన్ పొరను నాశనం చేస్తాయి. వీటి స్థానంలో ఓజోన్ పొరకు తక్కువ నష్టం కలిగించే పదార్థాలు వస్తున్నాయి. ఇవి వాడేలా ప్రచారం చేసి ఒప్పించాలి .వ్యవసాయంలో అధిక దిగుబడి కోసం రసాయనిక క్రిమిసంహారక మందులు, స్త్రీ లు, విచ్చలవిడిగా వాడుతున్నాం.
పచ్చని చెట్లే పర్యావరణానికి శ్రీరామరక్ష