రుణమాఫీతో క్రమశిక్షణ పట్టుతప్పుతుందా! బ్యాంకుల్ని

బ్యాంకుల్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రైతులకు తాము చేసిన ఎన్నికల వాగ్దానం నెరవేరుస్తున్నట్లు ప్రకటించారు. చిన్న, సన్నకారు రైతులకు చెందిన సుమారు రూ.36 వేలకోట్ల రుణాల్ని రద్దు చేస్తున్నామన్న యూపీ నిరయం వెలుగు చూడగానే కలకలం రేగింది. హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలోనూ ఆ తరహా మాఫీ కోరుతూ డిమాండ్లు జోరె త్తాయి. ఈ వరసను నిరసిస్తూ ఉర్జిత్ పటేల్ ఘాటు వ్యాఖ్యలు గుప్పించా రు. వ్యవసాయానికి తీసుకున్న అప్పుల్ని మాఫీ చేస్తే, దేశంలో రుణ క్రమ శిక్షణే దెబ్బతినిపోతుందని ఆయన సూత్రీకరించారు. రైతుల జీవన వైకుంఠపాళిలో వూతమిచ్చి పైకి నడిపించే నిచ్చెనలు తక్కువ. అదాటున మింగేసి కిందకు తోసేసే పాములే ఎక్కువ. వాటిలో పెద్దపాము, కచ్చి తంగా రుణమే. కష్టాలే పెట్టుబడి, నష్టాలే దిగుబడిగా ఏటికి ఎదురీదు తున్న సాగుదారుల్లో అత్యధికులకు ఏటేటా అప్పుల ముప్పుతిప్పలు తప్పడం లేదు. ఏ రైతూ ఏరికోరి ఆ వూబిలో కూరుకుపోవాలనుకోడు. అయినా దేశంలో అటువంటి రుణగ్రస్తుల సంఖ్య పోనుపోను విస్తరిస్తుం డటం, వ్యవసాయ రంగ నష్టజాతకాన్ని ధ్రువీకరిస్తోంది. ఆ లోతుపాతు లేవీ పెద్దగా తెలియని రిజర్వ్ బ్యాంకు గవర్నరు రుణమాఫీని పనికి మాలిందని తీర్మానించేశారు. వ్యవసాయం పట్ల సరైన అవగాహన లేని వ్యక్తులు విధాన నిర్ణేతలుగా ముఖ్యాధికార స్థానాల్లో కుదురుకొని తీరిగ్గా ఇటువంటి వ్యాఖ్యలకు తెగబడటం దురదృష్టకరం. ఒకప్పుడు సేద్యంపై ఆధారపడే జనసంఖ్య 80 శాతం దాకా ఉండే దేశంలో నేడది సుమారు 50 శాతానికి పడిపోయింది. స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 43 శాతం నుంచి 12 శాతానికి కుంగిపోయింది. వ్యవసాయ ప్రధాన దేశంలో ఈ తరహా గణాంకాలు పరికించి బాధ్యతాయుత అధికా ర గణం, పాలక శ్రేణులు గంగవెర్రులెత్తిపోవాలి. అందుకు విరుద్ధంగా పనికిమాలిన సూత్రీకరణలు, వక్ర భాష్యాలు పొంగులు వారుతున్నాయి. రైతు బతుకులో నిప్పులు పోసి, భవిష్యత్తును దుంపనాశనం చేసిన లెక్కకు మిక్కిలి నిరర్థక విధానాలే నేటి దుస్థితికి శాయశక్తులా పుణ్యం కట్టుకున్నాయి. రైతు కష్టజీవి. అతడి శ్రమ సొంత కుటుంబం కోసమే కాదు. జాతికి పట్టెడన్నం పెట్టడం కోసం యావత్తు కుటుంబానికీ పనులు కట్టబెట్టి బాధ్యతలు పంచి రెక్కలు ముక్కలు చేసుకుంటాడు. దుక్కి దున్ని, నారు పోసి, పోషకాలు వాడి, చేతనైనంతగా పంట దిగుబడులు సాధించాలని ఆరాటపడతాడు. ఆ ఆరాటం వట్టిపోకుండా సాగించే పోరాటంలో పరపతి దశలోనే పాముల గండం రైతన్న బతుకును గుండం చేసేస్తోంది. అంతటి కష్టాన్ని పంటిబిగువున ఓర్చుకుంటున్న రైతు ఎన్నడూ తనంత తానుగా రుణమాఫీ కోరుకోలేదు, కోరుకోడు. బకాయి వసూళ్లను నికరంగా మదింపు వేసి, నిజాయతీగా లెక్కలు వెల్లడిస్తే- గ్రామసీమల్లోనే అవి అధికమని నిగ్గు తేలుతుంది. ఎందుకంటే- రైతు చెయ్యి ఇంకొకరికి పెట్టేదేగాని, ఎవరినీ అర్థించదు. వ్యవసాయదారుల దురవస్థను దృష్టిలో ఉంచుకుని, ఎన్నికల లబ్ది పై కన్నే సిన కొన్ని రాజకీయ పక్షాలు రైతు రుణాల్ని మాఫీ చేస్తామంటూ హామీలు గుప్పిస్తున్న మాట నిజం. వాటివల్ల ఒనగూడే ప్రయోజనం ఏపాటి? శోషవచ్చి కింద పడిపోయినవాడి ముఖాన నీళ్లు చిలకరించిన చందంగా చేపడుతున్న అరకొర మాఫీల మూలాన సమస్త కడగండ్లూ కనుమరుగై సేద్యం అమాంతం కుదుటపడుతుందా? ఉర్జిత్ పటేల్ కనుసన్నల్లో పనిచే యాల్సిన ఆర్ బీఐ మార్గనిర్దేశాల ప్రకారం మొత్తం బ్యాంకు రుణాల్లో వ్యవసాయ రంగానికి 18 శాతం వాటా దక్కాల్సి ఉంది. ఆ నిబం ధనల్ని ఏనాడైనా సక్రమంగా పాటించారో లేదో గుండెల మీద చెయ్యి వేసుకుని ఆయన నిజం చెప్పగలరా? బ్యాంకు రుణాల్లో సింహభాగం పుస్తక సర్దుబాట్లేనన్నది బహిరంగ రహస్యం. వాటిని కలిపి లెక్కించినా- రుణ వితరణ 11 శాతం లోపేనని, గ్రామీణ సేద్యానికి అయిదు శాతమైనా దక్కడం లేదని అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నా యి. పంట రుణాల మంజూరు విధివిధానాల్ని ప్రక్షాళిస్తేగాని, వ్యవసా య రంగానికి కాలూ చెయ్యీ వాటిని కలిపి లెక్కించినా- రుణ వితరణ 11 శాతం లోపేనని, గ్రామీణ సేద్యానికి అయిదు శాతమైనా దక్కడం లేదని అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నా యి. పంట రుణాల మంజూరు విధివిధానాల్ని ప్రక్షాళిస్తేగాని, వ్యవసా య రంగానికి కాలూ చెయ్యీ ఆడదని ఎన్నెన్ని కమిటీలు మొత్తుకు న్నాయో నిర్ధారించడానికి ఏ చిత్రగుప్తుడో దిగిరావాలి! సామాజిక బాధ్యతగా రైతులకు ప్రాధాన్య ప్రాతిపదికన రుణాలివ్వాలని, దాన్ని విస్మరించడం అనుచితమని అడపాదడపా బ్యాంకుల ఉన్నతాది. కారులు ఉద్ఘాటిస్తున్నా- అవన్నీ కురవని మబ్బులే అవుతున్నాయి. ఏతావతా, దేశంలో మూడోవంతు రైతులకైనా వ్యవస్థాగత రుణాలు పుట్టడం లేదు. కౌలు రైతులకైతే ఎప్పుడూ వట్టి చేతులే! ఇంతటి 'ప్రాధాన్యం' లభిస్తున్న వ్యవసాయ రంగాన రుణాల మాఫీవల్ల తీవ్ర అనర్థం ఏదో దాపురించేస్తుందన్న ట్లుగా ఆర్ బీఐ చెప్పడం విడ్డూరం. చెప్పింది చేస్తున్నామంటూ పట్టాల కు ఎక్కించిన రుణమాఫీల అసలు బాగోతమేమిటో యూపీఏ జమా నాలో బట్టబయలైపోలేదూ! వేలకోట్ల రూపాయల భారీ రుణమాఫీతో రైతుల్ని ఒడ్డున పడేసింది తామేనన్న ఉదృత ప్రచారంతో కేంద్రంలో పునరధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ వాస్తవంలో మహాగారడి చేసిందని 'కాగ్' నివేదిక నాలుగేళ్ల క్రితం తెగేసి చెప్పింది. - సూరజ్