కేవలం కొంతమందికి స్వంతం అవుతున్న నాణ్యమైన విద్యావ్యవస్థ. సమాజ మార్పుకు పునాదులు వేసే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో SC, ST, BC, మైనారిటీ, విద్యార్థులే అధిక సంఖ్యలో చదువు కుంటున్నారనే నెపంతో వీరికి బాల్యంలోనే విధ్య నుండి దూరం చేయాలనే ఆలోచన ధోరణితో ప్రభుత్వాలు పాలన కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులను ప్రభుత్వాలు కల్పించకపోవడం, రోజు రోజుకు ప్రభుత్వ బడుల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య అని చెప్పవచ్చు. నాణ్యమైన నాటి విద్యావ్యవస్థ ఏది నేడు కనబడటం లేదని వేక్కిరిస్తున్న ఉదంతం. విద్య వ్యవస్థ పొరాటలలోని పాశ్చాత్య సంస్క ృతిని, నీతిని గమనించాల్సింది పోయి, అందహీనంగా, అవహేళన చేస్తూ , అవమానపరుస్తు, పల్లేటూరి బడులన్ని మూతపడుతు పట్టణాల్లో ఉన్న కార్పొరేట్ బడులు వెలుగులోకి వచ్చి ప్రభుత్వ విద్యను వేక్కిరిస్తుంటే నాణ్యత బట్టలకే నోచుకోలేని నా పేద బడుగు జాతులకు అందాల్సిన ప్రభుత్వ విద్య అందని ద్రాక్షల మారింది.”ఆకారం లేని రూపమ నీకెందుకు ఇంత ఆడంబరం” అనే విధంగా విర్రవీగే నేటి కార్పొరేట్ యాజమాన్యాలకు, ధీటుగా నేటి అణగారిన జాతి విద్యార్థులు అన్ని రంగాల్లో దేశం గర్వించదగ్గేలా తమ ప్రతిభను కనబరుస్తున్న గాని వారి పక్షాన ప్రభుత్వం అండగ నిలువలేకపోవటం. 7 దశాబ్దాల స్వాతంత్ర్య అనంతరం దేశ అభివృద్దికై ఉపయోగపడే సమగ్ర శాస్త్రీయ విద్యావిధానం నేటికి లేదనటంలో ఆశ్చర్యం లేకపోదు.” ప్రభుత్వం నాణ్యమైన విద్య ను అందించక పోగా , ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలుచేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవటం నిలువెత్తు సాక్ష్యం గా చెప్పవచ్చు. ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు కట్టలేక, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ను ప్రభుత్వాలు అందించలేక, “బడిలో ఫిజుల భారం, ఇంట్లో కిడ్నీల బేరం”అనే విధంగా పేద విద్యార్థుల కుటుంబాల గోషా. కేవలం విద్యను వ్యాపారంగా మలుచుకొని ప్రభుత్వ అధికార పాలకుల అండదండలతో ప్రైవేటు యాజమాన్యాలు విచ్చలవిడిగా తమ పోకడలను ఎత్తిచూపుతున్న ఉదంతాలు మనకు కనిపిస్తున్నాయి అనటం లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నత అధికారులు గ్రామాల్లో ఉన్న పాఠశాల పరిస్థితులను గమనించి, తక్షణమే విద్యార్థులకు అందుబాటులో ఉండే ఆంగ్ల విద్యని ప్రవేశపెట్టి, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులని కాళీగా ఉన్న పోస్టులను నియామకం ద్వారా భర్తీ చేసి సామాజిక మార్పులకు అనుగుణంగా పాఠశాలల భౌగోళిక పరిస్థితులని మార్చి, గ్రామ అభివృద్ధికి పునాదులు వేసే నిలయం ప్రభుత్వ పాఠశాల అని ప్రజలకి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. దేశ భవిష్యత్ తరగతి గదిలో మక్కిపోకుండా, సమసమాజ నిర్మాణానికి పునాది మన సర్కారు బడి అని మర్చిన అధికారులు నేటి పూరు బడుల్లో విద్యని అభ్యసించినవారే. కదం కదం కలుపుదాం కూళిపోతున్న ప్రభుత్వ విద్య గోడలని కపాడుదాం. దేశంలో శాస్త్రీయ విద్య విధానంకై, విద్యారంగంలోని రావాల్సిన మార్పులని విద్యార్థులంత సంఘటితం కావల్సిన అవసరం ఎంతగానో ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు, వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్య విషయంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ఈ దేశంలో ఉచిత విద్య, వైద్యం ప్రభుత్వాలు నిరుపేద ప్రజానీకానికి అందిచగల్గినట్లైతే ఈ దేశంలో పేదరికం నిర్ములించబడుతుంది. "విద్య వివేకాన్ని సమాజంలోని సాంప్రదాయ విలువల్ని మరింత వేగవంతంగా తుడిచి పెట్టడమే కాకుండా సామాజిక మార్పును ప్రేరేపిస్తాయని ప్రభుత్వ పాలకులు గుర్తించి విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..
చెల్పూరి శ్రీకాంత్ ఎంఏ పబ్లిక్ అడ్మిన్లేషన్
కాకతీయ యూనివర్సిటీ :వరంగల్
సెల్: 8297975713.